టె ’ర్రా’క్షసుల పైశాచికం 21/2
ఒక్క క్షణంహైదరాబాద్ తో పాటు
ప్రపంచమంతా ఉలిక్కి పడింది!
ఏం జరిగింది?
అత్యాధునిక సమాజంలో
అద్భుతమైన సాంకేతిక యుగంలో
ఎంత భద్రత ఉన్నా
అందరి ఎత్తులు చిత్తు చేస్తూ
మరణమృదంగం వాయించిన
ముష్కరుల మారణహోమానికి
భాగ్యనగరి మళ్ళీ దాసోహమంది!
ఎందుకు ఇలా?
ప్రశ్నించి ఏంలాభం!
మళ్ళీ ఏ సంవత్సరానికో
రెండేళ్ళకో ఏదో ఒక ప్రాంతంలో
మళ్ళీ మామూలే!
ఎక్స్ గ్రేషియాలు,పరామర్శలు
మీడియాలో చర్చోపచర్చలు
కేవలం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి!
ప్రజల తలరాతలు మాత్రం అంతే!!
ఈ మారణ హోమంలో సమిధలైన
తోటి నా భారతీయ ముద్దు బిడ్డలకు అంజలి ఘటిస్తూ .................
!